"పొలిమేర 2" మూవీకి అరుదైన ఘనత..!

MADDIBOINA AJAY KUMAR
సత్యం రాజేష్ , బాలాదిత్య , గెటప్ శీను , సాహితీ దాసరి , కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో కొంత కాలం క్రితం మా ఊరి పొలిమేర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు ఆ తర్వాత ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కడం మొదలు అయింది. ఇక ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది.

అలా ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "మా ఊరి పొలిమేర 2" అనే సినిమాని రూపొందించారు. ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో కూడా సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల , బాలాదిత్య , గెటప్ శీను , సాహితీ దాసరి ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది.

అలాగే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓ ఘనతను దక్కించుకుంది.  ప్రతిష్టాత్మకమైన 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ సినిమా ప్రదర్శనకు ఎంపిక అయినట్లు ఈ సినిమా దర్శకుడు అయినటు వంటి అనిల్ విశ్వనాథ్ తాజాగా వెల్లడించాడు. ఇలా ఈ అరుదైన ఘనతను "మా ఊరి పొలిమేర 2" సినిమా దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: