జగమంత జగన్: ల్యాండ్ టైటిలింగ్ యాక్టిఫై.. నీతి అయోగ్ క్లారిటీ..!
ముఖ్యంగా ఈ చట్టం వల్ల ప్రయోజనాలకు కూడా కితాబు ఇచ్చింది నీతి అయోగ్.. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వహక్కులు కూడా ఉంటాయని నీతి అయోగ్ వెల్లడించింది.రైతులు భూములు లాక్కొనే పరిస్థితి అసలు ఎక్కడా కూడా ఉండదంటు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో అటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరింత చేకూరిందని కూడా చెప్పవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమలులోకి వస్తే భూ పరిపాలన మరింత సులువు అవుతుందంటూ కూడా వెల్లడించారు.. ముఖ్యంగా భూ యాజమాన్యం నిర్వహనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యం అన్నట్లుగా నీతి అయోగ్ ప్రకటించింది.
ఈ చట్టం వల్ల భూమి మరింత భద్రతగా ఉంటుందంటూ తేల్చి చెప్పింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన జరుగుతున్న దృశప్రచారానికి సైతం నీతి అయోగ్ ఒకసారి గా చెక్ పెట్టడంతో టిడిపి నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందంటూ కూడా తెలియజేసింది.. ఆర్టిఐ ద్వారా వెంకటేష్ అనే వ్యక్తి చేసిన అప్లికేషన్ వరకు నీతి అయోగ్ ఈ సమాచారాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. భూములపై రైతులకు సర్వహక్కులు కలిగించేలా ఉండడమే నీతి అయోగ్ వెల్లడించింది.. భూములపై రైతులకు సర్వహక్కులు కలిగించేలా ఉండడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమని నీతి అయోగ్ చాలా క్లారిటీతో చెప్పేసింది. అయితే ఏపీలో తీసుకువచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ ఎలా ఉంది అనే సిఫార్సు పైన ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలతో చేశారా లేదా అనేది మాత్రమే ఇంకా తెలియాల్సి ఉంది.