మహేష్ బాబు పై సీనియర్ నటి రోజా ప్రశంసలు..!

Anilkumar
మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ సూపర్ స్టార్ మహేశ్ బాబు తీసుకుంటున్న నిర్ణయానికి ఇప్పుడు  పెద్ద ఎత్తున్న ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అయితే గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలకు మహేశ్ బాబు అండగా నిలుస్తున్నాడు.ఇక దీని పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అందరూ ఇప్పుడు మహేశ్ బాబు దయాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇకపోతే ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రుల పిల్లల ఆరోగ్యం కోసం పాటుపడుతూ.. తనకున్న సామాజిక స్పృహను చాటుకుంటున్నారు ఈయన.అయితే దీనికి గాను  హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న చిన్నారుల కోసం మహేశ్ ఓ చారిటీ సంస్థను స్థాపించారు. 

అయితే మహేష్ బాబు ఫౌండేషన్ మద్దతును తాజాగా రేయిన్ బో ఆస్పత్రి నిర్వహిస్తున్న ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు  తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే మహేశ్ బాబు ఫాండేషన్ ద్వారా వందల మంది చిన్నారులకు అవసరమైన వైద్యం అందించారు. ఇకపోతే తాజాగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు మద్దతుగా నిలిచి 120 మంది పేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించేందుకు పూర్తి బాధ్యతను తీసుకున్నారు.ఇక ఇదిలా ఉంటె తాజాగా మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయానికి నగరి ఎమ్మెల్యే, నటి రోజా  హృదయపూర్వకంగా అభినందలు తెలిపారు.అయితే  ఈ సందర్భంగా రేయిన్ బో ఆస్పత్రిలో మహేష్ బాబు మీడియాతో ఇంటరాక్ట్ అయిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఇకపోతే  'చిన్నారుల గుండె చప్పుడు వింటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హ్యాట్యాఫ్' అంటూ అభినందించింది. అయితే 1991 నుంచి 2004 వరకు లీడ్ యాక్ట్రెస్ గా కొనసాగిన రోజా ప్రస్తుతం ప్రజాసేవకు సమయం వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉంటె మరోవైపు ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో 'జబర్దస్త్' షోలకు జడ్జీగా ను వ్యవహరిస్తున్నాయి. అయితే ఇదే షోలో గతంలో ఓ సందర్భంలో మీరేదైనా కోరిక కోరుకోమని హైపర్‌ ఆది అనగా, తనకు కృష్ణగారి కొడుకు మహేష్‌ తో కలిసి నటించాలని ఉందంటూ రోజా తన మనస్సులోని మాటను చెప్పుకొచ్చింది. అయితే త్వరలో వీరిద్దరూ స్క్రీన్ పై కనిపించే అవకాశాలు కూడా ఉండవచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: