మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. లాక్ డౌన్ తరవాత 50 శాతం సీటింగ్ పరిమితితో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ ల వర్షం కురిపించింది. అంతే కాకుండా విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలకు మళ్లీ నమ్మకం కలిగించింది. ఇక ఈ సినిమా తరవాత రవితేజ కూడా స్పీడ్ పెంచారు. వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అంతే కాకుండా రవితేజ క్రాక్ విజయం తరవాత రెమ్యునేషన్ ను కూడా పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు రమేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇక ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా రవితే ఇప్పటికే మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే నక్కిన త్రినాథరావు దర్శకత్వలో ఓ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం రవితేజ మరో సినిమాను కూడా లైన్ లో పెడుతున్నారట. మంచు లక్ష్మి అడవిశేషు లీడ్ రోల్ లో నటించిన దొంగాట సినిమా దర్శకుడు వంశీక్రిష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే వంశీక్రిష్ణ రవితేజ కు కథను వినిపించారట. ఇక దీనికి రవితేజ కూడా ఓకే చెబితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.