పూజా హెగ్డే ఇక తెలుగులో సినిమాలు చేయదట...కారణం ఏమిటో తెలుసా...?
ప్రస్తుతం తెలుగులో పూజా... అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.మరో వైపు డార్లింగ్ ప్రభాస్ తో రాధే శ్యామ్ చిత్రం చేస్తోంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా ఈ మధ్య ముంబైలో ఎక్కువ కనిపిస్తోంది పూజా. హిందీలోనూ పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు డేట్స్ ఇచ్చేసారట ఈ పొడవు కాళ్ళ సుందరి. అందులోనూ ఇవన్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్నాయట.
అయితే ఆ తరువాత కూడా బాలీవుడ్ లోనే మరి కొన్ని ప్రాజెక్టులు ఈమెకు క్యూలో ఉన్నాయని...కాబట్టి ఇక ఈమె బాలీవుడ్ కే పరిమితం కాబోతోందన్న వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి. మరి ఇకపై తెలుగు సినిమాలు చేస్తుందో లేదో అని టాలీవుడ్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఏమి జరగనుందో ముందు ముందు తెలియాల్సి ఉంది. కాగా త్వరలోనే విడుదల కానున్న పూజా హెగ్డే అఖిల్ నటించిన సినిమా విడుదల కాబోతోంది. కనీసం పూజా హెగ్డే అయినా అఖిల్ మూవీ సక్సెస్ అవ్వడంలో ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.