మరోసారి మహేష్ బాబుతో జతకడుతున్న మిల్కీ బ్యూటీ.. కానీ ఈసారి అలా కాదట..!!
రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఉండనుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. జక్కన కూడా సినిమాను కన్ఫామ్ చేసాడు.అయితే ఇటు మహేష్ బిజీగా ఉండటం..అటు రాజమౌళి తన సినిమాలతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా మహేష్ తో మిల్కీ బ్యూటీ తమన్నానటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఆగడు సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా మహేష్ తమన్నా కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే ఈ ఇద్దరు మరోసారి కలిసి నటించ బోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే అది సినిమాలో కాదట. ఒక వాణిజ్య ప్రకటన కోసం మహేష్ తమన్నా కలిసి కనిపించనున్నారని తెలుస్తుంది. వాణిజ్య ప్రకటనల పరంగా మహేష్ .. తమన్నా ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తమన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన సీటిమార్ అనే సినిమాలో నటిస్తుంది...ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది..ఏప్రిల్ 2 న రిలీజ్ కానున్న ఈ సినిమా కచ్చితంగా గోపిచంద్, తమన్నా లకి మంచి కం బ్యాక్ మూవీ అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు...!!