బుల్లి తెరపైకి జూనియర్ ఎన్టీఆర్..?

NAGARJUNA NAKKA
ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపైకి వస్తున్నాడు. రియాలిటీ షో బిగ్‌బాస్‌ తారక్‌తో మొదలైన సంగతి తెలిసిందే. తొలి అడుగులోనే అదరగొట్టేసిన తారక్‌ మరోసారి హోస్ట్‌ అవతారం ఎత్తుతున్నాడు. రేటింగ్‌లో వెనుకబడిన ఓ ఛానల్‌ ఎన్టీఆర్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట.
బిగ్‌బాస్‌ మూడు, నాలుగు సీజన్స్‌ హోస్ట్‌గా నాగార్జున  ఓకె అనిపించుకున్నా.. ఇప్పటికీ ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను తలుస్తూనే ఉంటారు. తారక్‌లో ఉన్న స్పాంటినిటీ.. ఎక్స్‌ప్రెషన్స్‌.. టైమింగ్‌ ఒకటేంటి.. అన్నిరకాల క్యాపబిలిటీస్‌ ఆడయన్స్‌ను కట్టిపడేశాయి. తారక్‌ హోస్ట్‌గా వ్యవహరించడం వలనో.. లేదంటే.. తెలిసిన పార్టిస్‌పెంట్స్‌ ఉండడం వలనో బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ ప్రేక్షకుల్లో నిలిచిపోయింది.
తారక్ ఇచ్చిన స్ఫూర్తితో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ వరకు వచ్చాడు. బిగ్‌బాస్‌ 'స్టార్‌ మా'కు పేరుతోపాటు రేటింగ్‌ తీసుకొచ్చాడు. మరోవైపు సీరియల్స్‌ కూడా పాపులర్‌ కావడంతో.. రేటింగ్‌లో 'స్టార్‌ మా' టాప్‌ పొజిషన్‌కు చేరింది. దశాబ్దం క్రితం నెంబర్‌ఒన్‌గా వున్న జెమిని రేటింగ్స్‌లో వెనుకపడిపోయింది. పూర్వవైభవం కోసం యాజమాన్యం..  తారక్‌ను రంగంలో దింపుతోంది.  ఎన్టీఆర్‌తో రియాలిటీ షో గానీ.. టాక్‌ షోగానీ ప్లాన్‌ చేసి హోస్ట్‌గా ఆయన్ని ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారట. ఆల్ రెడీ ఈ షోకు సంబంధించి  అన్నపూర్ణ స్టూడియోలో సెట్‌  పనులు జరుగుతున్నాయని సమాచారం.
తారక్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తన పార్ట్‌ పూర్తికాగానే.. త్రివిక్రమ్‌ మూవీ చేస్తూ.. హోస్ట్‌ అవతారం ఎత్తుతాడట.  మూడేళ్ల క్రితమే.. బిగ్‌బాస్‌ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 50 లక్షలు తీసుకున్నాడని టాక్‌ నడిచింది. ఆల్ రెడీ  సక్సెస్‌ఫుల్‌ హోస్ట్ కాబట్టి.. పెరిగిన క్రేజ్‌ రీత్యా.. రెమ్యునరేషన్‌ రోజుకు 50 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది.
మొత్తానికి మరోసారి బుల్లితెరపైకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టు కనిపిస్తోంది. తారక్ ను జెమినీ టీవీ యాజమాన్యం ఒప్పించిందే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రేటింగ్ కోసమే ఇదంతా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హో్స్ట్ గా ఆయన మంచి ప్రతిభ కనుబరచడంతో ఆ టీవీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: