సందీప్ ను హర్ట్ చేసింది ఎవరు ?
అప్పట్లో పూరి జగన్నాథ్ కు కొందరు నిర్మాతలతో తలనొప్పులు వచ్చేసరికి ఇకపై తాను చేసే ప్రతి సినిమా సొంత బేనర్లోనే ఉంటుందని బయటి బేనర్లకు సినిమాలు చేయనని ఓపెన్ గా ప్రకటన ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అప్పట్లో తాను అన్న మాట ప్రకారం ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘శివమణి’ ఇలా వరుసగా సొంత బేనర్ లో సినిమాలు చేసాడు.
అయితే ఆతరువాత నిర్మాతగా పూరీకి నష్టాలు రావడంతో మరో మార్గంలేక బయటి బేనర్లకు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే మళ్ళీ పూరి యూటర్న్ తీసుకుని అతడి స్నేహితురాలు ఛార్మి సహకారంతో మళ్లీ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టాడు. ఇప్పుడు దర్శకుడు సందీప్ వంగా కూడ పూరి మార్గాన్ని అనుసరిస్తూ ఇక తాను తీసే ప్రతి సినిమా తన సొంత బేనర్లోనే చేస్తానని ఈమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. దీనికికారణం సందీప్ వంగా కూడ నిర్మాతల తీరుతో విసిగిపోయాడట. తెలుగులో అదేవిధంగా హిందీలో రెండు బ్లాకు బస్టర్ మూవీలు తీసిన ఈ దర్శకుడికి సరైన అవకాశాలు ఇవ్వక పోవడంతో ఇక తానె నిర్మాతగా మారాలని సందీప్ నిశ్చయించుకున్నాడట.
ఆ మధ్య సందీప్ ఏదో చిన్న సినిమా చేస్తున్నాడని వెబ్ సిరీస్ మొదలుపెడుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఏదీ ఖరారవ్వలేదు దీనికితోడు సందీప్ ట్రావెల్ చేస్తున్న నిర్మాతలతో విభేదాలొచ్చాయని అందుకే హర్టయి వేరే నిర్మాతలకు సినిమాలు చేయనని సొంత బేనర్లో మాత్రమే చేయాలని ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకి సందీప్ ని హర్ట్ చేసింది ఎవరు అన్నది ప్రస్తుతానికి సీక్రిట్..