ప్రభాస్ ఫ్యాన్స్ కోసం యూవీ టీమ్ దిగొస్తుందా..?

Murali

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్త ప్రస్తుతం ఇండియన్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా కథే అని గతం నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే.. సినిమా పూజా కార్యక్రమం, ఆమధ్య జార్జియాలో ఓ షెడ్యూల్ తప్పించి సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ లేదు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను సోషల్ మీడియా వేదికాగా ఆడుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి ఒత్తిడి తట్టుకోలేక ఇందుకు రంగం సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

ఫ్యాన్స్ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక సినిమాలో ప్రభాస్ లుక్ రివీల్ చేసేందుకు యూవీ సంస్థ సిద్దమవుతోందని అంటున్నారు. దీంతోపాటు సినిమా టైటిల్, మ్యూజిక్ డైరక్టర్ పేరు కూడా రివీల్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. యూవీ సంస్థలో ప్రభాస్ కూడా పార్టనర్ అనే విషయం తెలిసిందే. దీంతో ఇక ఫ్యాన్స్ ను వెయిట్ చేయించి లాభం లేదని.. వెంటనే ఓ అప్డేట్ ఇవ్వాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. మ్యూజిక్ డైరక్టర్ విషయంలో కూడా టీమ్ ఇంకా ఫిక్స్ కాకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సైరాకు సంగీతం అందించిన అమిత్ త్రివేదీని అనుకుంటున్నారని చెప్తున్నా ఇంకా దీనిపై క్లారిటీ లేదు.

 

ఈ విషయంలో కూడా త్వరగా ఓ నిర్ణయానికి రావాలని టీమ్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికి గాసిప్స్ గా ఉన్న ఈ వార్తలన్నింటిపై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే. బాహుబలితో వచ్చిన క్రేజ్ దృష్ట్యా ప్రభాస్ సినిమాపై అన్ని రకాలుగా ఆలోచించాల్సిందే. దీంతో ఇక ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా తరహా కథలు కావాల్సిందే అనే విషయం అర్ధమైపోయింది. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా కానీ.. బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.

radha krishna kumar ..." />

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: