ఛలో తరువాత వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ లను చవిచూసిన యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల అశ్వథ్థామతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కథ కూడా తనే అందించగా రమణ తేజ డైరెక్ట్ చేశాడు అయితే ఈచిత్రం కూడా నాగశౌర్యకు విజయాన్ని అందించలేకపోయింది. కేవలం 4కోట్ల వసూళ్లను రాబట్టి పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కలను సన్ నెక్స్ట్ దక్కించుకోగా శాటిలైట్ హక్కులను జెమినీ టీవి సొంతం చేసుకుంది. కొద్దీ రోజుల క్రితం ఈసినిమా ను జెమినీ మొదటి సారి ప్రసారం చేయగా 9.10(అర్బన్ ) టీఆర్పీ ని రాబట్టింది. అంతేకాదు శౌర్య కెరీర్ లో ఈ రేంజ్ లో రేటింగ్స్ రావడం ఇదే మొదటి సారి. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై తేలిపోయిన ఈ చిత్రం బుల్లితెర పై మాత్రం సత్తా చాటింది. ఇక గత నెలలోనే సన్ నెక్స్ట్ ఈసినిమా ను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
ఇదిలావుంటే నాగ శౌర్య చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమా వున్నాయి. అందులో శ్రీనివాస్ అవసరాలతో చేస్తున్న సినిమా ఒకటి. గత ఏడాది మొదలైన ఈసినిమా 50శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అయితే ఈచిత్రాన్ని పక్కకు పెట్టి నాగ శౌర్య అశ్వథ్థామ ను లైన్ లోకి తెచ్చాడు. అలా ఈసినిమా కు బ్రేక్ పడింది అయితే త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. ఇక శౌర్య ప్రస్తుతం లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతోపాటు సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో అలాగే మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో నూతన దర్శకుడు రాజాతో నాగ శౌర్య సినిమాలు చేయాల్సి వుంది.