గత ఏడాది గద్దల కొండ గణేష్ తో సూపర్ హిట్ కొట్టడంతో యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ బిజీ అయ్యాడు. అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు హరీష్ ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ తో హరీష్ ఓ సినిమా చేయనున్నాడు. ఈసినిమాలో హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ తరువాత మళ్ళి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా వుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హరీష్ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈఏడాది చివర్లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు వున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఈసినిమా తోపాటు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో హరీష్ ఓ సినిమా చేయాల్సివుంది. ఓ మీడియం రేంజ్ హీరోతో ఈ సినిమా ఉంటుందని టాక్. త్వరలోనే ఈసినిమా గురించి ప్రకటన వెలుబడనుంది. ఇక గద్దల కొండ గణేష్ తో లాభాలు తెచ్చిపెట్టడంతో 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట ,గోపించంద్ అంచంట,హరీష్ తో మరో సినిమా చేయనున్నామని ఈరోజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే హీరో ఎవరు అనేది క్లారిటీ రావాల్సివుంది. మొత్తానికి ఒక్క హిట్టుతో హరీష్ కు మరో రెండేళ్ల వరకు నిర్మాతల కొరకు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండాపోయింది.