ఆ పనిచేస్తే డేట్‌కి వస్తానంటున్న పరిణీతి చోప్రా!

JSR
కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు సెలబ్రిటీలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ వంతుగా విరాళాలు ప్రకటించటంతో పాటు ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు కృషి చేస్తున్నారు. అందులో వినూత్నంగా ప్రయత్నిస్తున్న తారలు కూడా ఉన్నారు. ఇటీవల హీరోయిన్ శ్రియ 200 రూపాయలు ఇచ్చిన వారికి తనతో డ్యాన్స్ చేసే ఛాన్స్‌ ఇస్తానంటూ ప్రకటించింది. తాజాగా మరో బ్యూటీ కూడా ఓ క్రేజీ ఆఫర్‌ ఇచ్చింది.

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కూడా ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. రోజుకు 1000 కుటుంబాలను ఆదుకునేందుకు పరిణీతి ముందుకు వచ్చింది. రోజుకు 4000 వేల మంది భోజన సదుపాయం ఇచ్చేందుకు విర్చువల్‌ కాఫీ డేట్‌ విత్ పరిణితి చోప్రా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. `దాదాపు లక్షల మంది ప్రజలు లాక్‌ డౌన్‌ కారణంగా పని కోల్పోయి ఆకలితో ఉన్నారు.`ఈ సమయంలో ఎవరూ ఆకలితో నిద్రపోకుండా మనం చూసుకోవాలి అంటూ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో సాహయం చేసిన వారిలో లక్కీ 5 మెంబర్స్‌ను సెలెక్ట్ చేసి వారితో తాను విర్చువల్‌ కాఫీ డేట్ లో పాల్గొంటానని చెప్పింది. వారితో వీడియో కాల్‌లో మాట్లాడతానని చెప్పింది పరిణీతి చోప్రా. మరి పరిణీతి ఇచ్చిన ఆఫర్‌కు ఎంత మంది స్పందిస్తారో చూడాలి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
•FOR THE DAILY WAGE WORKERS• You say

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: