ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కారణం..??

murali krishna
కొన్ని సినిమాల వల్ల టాలీవుడ్ స్థాయి మాత్రమే కాదు... తెలుగు హీరోల స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు...ప్రపంచ వ్యాప్తంగా తెలుగు హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు.ఏన్టీఆర్‌.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన హృతిక్‌ రోషన్‌తో కలిసి `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ కోసం ముంబయిలోనే ఉన్నారు ఎన్టీఆర్‌.దేవర చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 షూటింగ్ కోసం కొద్ది రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ స్టార్స్ పార్టీలలోనూ తారక్ సందడి చేస్తున్నారు.ఇటీవల ఎన్టీఆర్, భార్య ప్రణతి ముంబైలో బాలీవుడ్ డిన్నర్ పార్టీకి వెళ్లగా అక్కడి నుంచి కూడా ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఎన్నో ఏళ్లుగా స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు అనుపమ్ ఖేర్. నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి గౌరవ పతకాలని, ఎన్నో అవార్డుని అందుకున్నారు. ఇటీవల తెలుగులో కార్తికేయ 2 సినిమాలో శ్రీకృష్ణుడి గురించి చెప్పే సన్నివేశంలో కనిపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి సినిమాలల్లో చేస్తున్నారు ఆయన.నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరైన తారక్ను గత రాత్రి కలవడం చాలా సంతోషంగా ఉంది. అతని నటన నాకు చాలా నచ్చింది. అతను ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ ఎన్టీఆర్తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అనుపమ్ ఖేర్. ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

దీనికి ఎన్టీఆర్‌ స్పందించారు. అద్భుతమైన పనితనం కలిగిన నటుడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఆయన పనిని నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండిసర్‌` అని పేర్కొన్నాడు తారక్‌. ఆయన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.  అయితే వీరిద్దరూ కలవడానికి ఏమైనా స్పెషల్ కారణముందా లేదా మామూలుగానే కలిశారా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది. దాంతో అనుపమ్ ఖేర్ మామూలుగానే ఎన్టీఆర్ను కలిశాడా లేదా ఆయన కూడా ఆ సినిమాలో నటిస్తున్నారా అని ప్రేక్షకులు సందేహిస్తున్నారు. తారక్‌ అభిమానులు ఈ పోస్ట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బాలీవుడ్‌లో తారక్‌ అన్న దున్నేయాలని అంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్... ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.  ప్రస్తుతం తారక్‌ 'దేవర'లో నటిస్తున్నారు. దీని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పాటలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌ హీరోగా రూపొందుతోన్న 'వార్‌2'లోనూ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: