'ఆ విషయం రేపు చెప్తా' అంటున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అంటే కలుపుగోలు మనిషి.. అందరితో సరదాగా ఉంటారు అనే మాట ఉంది ఇండస్ట్రీలో. ఇందుకు సోషల్ మీడియాలో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన యాక్టివ్ గా ఉంటున్న తీరే నిదర్శనం. ప్రతి విషయాన్ని ట్విట్టర్ లో ఉంచుతూ.. ఛాలెంజ్ లు విసురుతూ సందడి చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాను రఫ్పాడేస్తున్నారనే చెప్పాలి. రీసెంట్ గా బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ద్వారా సందడి చేసిన మెగాస్టార్ మరో ఆసక్తికర పోస్ట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేశారు.
‘సాధారణంగా షూటింగ్ ఆన్ లొకేషన్లలో ఉండి పాటల చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆ పాటలను పూర్తిగా వింటూ ఆనందిస్తాం. మధ్యలో ఎటువంటి బ్రేకులు వేయం. కానీ.. ఈ మధ్య ఓ పాట నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. పాటను వింటూ మధ్యలో ఆపేసి మళ్లీ మొదటి నుంచీ వింటున్నాను. ఇందుకు కారణమేంటో రేపు ఉదయం 9గంటలకు వివరిస్తాను’ అంటూ పోస్ట్ చేశారు. వివరాలను రేపు ఉదయం వరకూ పోస్ట్ పోన్ చేసి ఫ్యాన్స్ కు, నెటిజన్లకు సస్పెన్స్ మిగిల్చారు. ఇప్పుడ నెటిజన్లంతా మెగాస్టార్ ను ఇబ్బంది పెడుతున్న ఆ పాటే ఏంటా అని ఆలోచించేస్తున్నారు. ఈ మెసేజ్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Usually, when we shoot songs, I thoroughly enjoy listening to them and wouldn't like interruptions. But recently, I have been enjoying pausing and resuming a song over and again. కారణం ... ...? ...tomorrow morning 9.00 am — chiranjeevi konidela (@KChiruTweets) April 27, 2020
‘ఓకే బాస్.. వెయిటింగ్, ఎంత ట్విస్టు పెట్టారు బాస్..’ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవిలోని యాక్టివ్ నెస్ ను అభిమానులు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు. మరి మెగాస్టార్ ను ఇబ్బంది పెడుతున్న పాట ఏంటో తెలుసుకోవాలంటే రేపు ఉదయం 9గంటల వరకూ ఆగాల్సిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తన్నారు. కాజల్ కథానాయిక. కరోనా పరిస్థితుల చక్కబడ్డాక షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.