బోర్ కొడుతుందని అనడం తొందరపడినట్టా..!
బిగ్ బాస్ సీజన్ 3 తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ పునర్నవి భూపాళం. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత పిట్టగోడ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అప్పటివరకు ఏదో చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న ఈ అమ్మడికి బిగ్ బాస్ ద్వారా బాగా గుర్తింపు వచ్చింది. షోలో ఆమె యాటిట్యూడ్ మాత్రమే కాదు అమ్మడు రాహుల్ సిప్లిగంజ్ తో నడిపించిన లవ్ స్టోరీ కూడా బాగా ఫేమస్ అయ్యింది.
షో తర్వాత కూడా అమ్మడు తనకు వచ్చిన ఐడెంటిటీని కాపాడుకునేందుకు హాట్ షోస్ చేస్తూ అదరగొడుతుంది అమ్మడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా రాహుల్ అండ్ గ్యాంగ్ తో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు ఇక ఇప్పుడు లాక్ డౌన్ టైం లో బోర్ కొడుతుందని చెప్పి తొందరపడ్డానా అంటూ తనని తానే ప్రశ్నించుకుంటుంది. 21 రోజుల లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అంటా తమలోని స్పెషల్ టాలెంట్ బయటపెడుతున్నారు.
పూజా హెగ్డే హల్వా చేసుకునున్నా అని ఊరించుకుంటూ తినగా.. రీసెంట్ గా కాజల్ కూడా తాను చేసిన సమోసా సూపర్ అంటూ సోషల్ మీడియాలో పెట్టింది. లాక్ డౌన్ టైం లో అందరు తమ ఇళ్లల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. పునర్నవి మాత్రం బయటకు రాకుండా ఉండలేక బోర్ కొడుతుందని చెబుతుంది. అయితే అలా చెప్పడంలో తొందరపడ్డా అని అంటుంది. ఎందుకంటే పరిస్థితి కంట్రోల్ లో వచ్చే వరకు లాక్ డౌన్ పొడిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉంది. అయితే 21 రోజులే కాదు మరో 15 రోజులు దాకా లాక్ డౌన్ ఉండే పరిస్థితి కనబడుతుండగా పునర్నవి అప్పుడే బోర్ కొడుతుందని అనడంపై నెటిజెన్ల ఆమెను ఆడుకుంటున్నారు.
View this post on InstagramIs it too soon to say that I'm bored? 🍭 A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on