పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్కు జంట కోసం ఆ మధ్య పలువురి పేర్లు వినిపించాయి. క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ సినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ను ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి. తర్వాత ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారని కూడా అన్నారు
అభిరుచి కల చిత్రాలను రూపొందించే క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు. 'వకీల్ సాబ్' పూర్తి కాగానే ఈ భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఇప్పుడు ఆ చిత్రంలో పవన్ సరసన నటించేందుకు కీర్తి సురేష్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. కీర్తి గతంలో పవన్ సినిమా
'అజ్ఞాతవాసి' లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయింది కానీ పవన్ - కీర్తి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. 'మహానటి' సినిమాలో భారీ గుర్తింపు సాధించిన కీర్తి అయితే ఈ ప్యాన్ ఇండియా సినిమాకు సూట్ అవుతుందని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇక పవన్ క్రిష్ సినిమాను ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాలను నిర్మించిన ఏ. ఎం.రత్నం రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: