మన శ్రీదేవి: `ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా.. ఆ నవ్వులో నువ్వుంటావ్‌.. అమ్మా`

JSR
2018 ఫిబ్రవరి 24 ఇండియాన్‌ సినిమాను విషాదం ముంచెత్తిన రోజు. దివి నుంచి భువికి దిగివచ్చిన ఓ అందాల రాశి తిరిగి స్వర్గలోకానికి పయనమైన రోజు. అది వెండితెరకు చీకటి రోజు లాంటిది. అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య పరిస్థిల్లో ఈ లోకాన్ని విడిచిన రోజు. ఆ దారుణ సంఘటన జరిగి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. అయిన భారతీయ సినీ ప్రేక్షకులు ఆమెను మరచిపోలేకపోతున్నారు. తన వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్‌ను వెండితెరకు పరిచయం చేయాలనుకున్న శ్రీదేవి, ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు.

ఇప్పటికే శ్రీదేవి కుటుంబం ఆమెను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనవుతుంది. గత ఏడాది ఇదే రోజున `నా హృదయం ఎప్పటికీ బరువెక్కుతుంది. అయినా నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటే ఎందుకంటే ఆ నవ్వులో నువ్వుంటావ్‌.. అమ్మా` అంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. శ్రీదేవి మరణానికి ముందు జాన్వీకి బోనికపూర్‌ మొదటి భార్య సంతానమైన అర్జున్‌ కపూర్‌, అన్షులాకపూర్‌లకు పెద్దగా సంబంధాలు లేవు. కానీ శ్రీదేవి మరణంతో ఒక్కటైన ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఎంతో సన్నిహితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా దుఖంలో ఉన్న సమయంలో జాన్వీని అర్జున్‌, అన్షులా ఎంతో దగ్గరకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్న జాన్వీ `మీకు తెలుసా చివరకు, మాది ఒకే రక్తం. నాకు ఆ ఒక్క విషయం తప్ప ఆ నాలుగు నెలలు ఏం జరిగిందో గుర్తు లేదు. ఒక రోజు మేం హర్ష అన్న రూంలో కూర్చొని ఉండగా అర్జున్‌ అన్న, అన్షులా అక్క వచ్చారు. ఆ రోజు మాకు పర్లేదు మేం బాగానే ఉంటా అనిపించింది` అని ట్వీట్ చేశారు. శ్రీదేవి కలను నెరవేరుస్తూ దడక్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జాన్వీ ప్రస్తుతం గుంజన్‌ సక్సెనా, దోస్తానా 2, రూహీఅఫ్జా, తక్త్‌ సినిమాల్లో నటిస్తోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
My heart will always be heavy. But I’ll always be smiling because it has you in it.

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: