బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ పై కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి పెంచే సుహాన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో షారూఖ్ కూడా సుహానకు నటన పట్ల ఆసక్తి ఉందని వెళ్లడించాడు.
అయితే తాజాగా బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఈ ముద్దుగుమ్మను వెండితెరకు పరిచయం చేయనున్నాడన్న వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ 13 పార్టిసిపెంట్ అసిమ్ రియాజ్, సుహానా ఖాన్లు లీడ్ రోల్స్లో కరణ్ నిర్మాతగా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 3ని తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కరణ్ జోహర్ క్లారిటీ ఇచ్చాడు.
గతంలో కరణ్ జోహర్, అలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, తారా సుతారియా లాంటి స్టార్ వారసులను వెండితెరకు పరిచయం చేశాడు. దీంతో సుహానాను కూడా సిద్ధార్థ్ పరిచయం చేస్తున్నాడన్న వార్తలు రావటంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే ఈ వార్తలను కరణ్ కొట్టి పారేశాడు. తన ట్విట్టర్ ద్వారా రూమర్స్కు చెక్ పెట్టాడు కరణ్. ఇలాంటి వార్తలను పబ్లిష్ చేయవద్దంటూ మీడియాను కోరాడు కరణ్. ఇక సినిమాల విషయానికి వస్తే కరణ్ నిర్మించి భూత్ ద హాంటెడ్ షిప్ తొలి భాగం ఈ నెల 21న రిలీజ్కు రెడీ అవుతోంది.
విక్కీ కౌషల్, భూమీ పడ్నేకర్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బీచ్లో కదలకుండా ఆగిపోయిన ఓ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అషుతోష్ రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్ సినిమాతో పోటి పడుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: