మెగా హీరోల్లోనే మెగా మేనళ్లుడు వేరయా... సాయి క్రేజ్ ఈ రేంజ్లోనా... !
శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్ ఇప్పుడు సినిమాల రేంజ్ను బాగా పెంచేసింది. ఏ హీరోకు అయినా ఈ రెండు మార్కెట్లు పెరుగుతుందంటే ఆ హీరోకు మార్కెట్ పెరిగినట్టే. సాయితేజ్ విషయంలో ఇది రుజువైంది. చిత్రలహరి ముందు వరకు సాయితేజ్ సినిమాలు కొనడానికి కూడా ఆలోచించాయి ఛానెళ్లు. వరుస ప్లాపులతో సాయి మార్కెట్ పూర్తిగా కుదేలైంది. కానీ ఇప్పుడు అతడు బుల్లితెరపై అతడి సినిమాల శాటిలైట్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
సాయి నటిస్తోన్న సినిమా సెట్స్ మీద ఉండగానే శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యే రేంజ్ వచ్చేసిందింటే ఇందుకు సాయి నటించిన చివరి రెండు సినిమాలు చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కారణం. అందుకే సాయి తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ అప్పుడే శాటిలైట్ కంప్లీట్ చేసుకుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది.
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అంతలోనే శాటిలైట్ పూర్తిచేశారు. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా రైట్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా సుబ్బ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయినా ఈ రేంజ్లో శాటిలైట్ అవ్వడ మంటే సాయి క్రేజ్ బాగా పెరిగిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. అది బాగా క్లిక్ అయింది. దీంతో ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరగనుంది.