వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి రెడీ అయిన "సుందరం మాస్టార్"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్ష చీముడు కొన్ని రోజుల క్రితం సుందరం మాస్టర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదట థియేటర్ లలో విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ యావరేజ్ స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెరపై ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ టీవీ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ , ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో భారీ స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

దివ్య శ్రీ పాద , బాలకృష్ణ నీలకంటపు , భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ మరియు సుధీర్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరించారు. ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసే భారీ విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాలోని హర్ష నటనకి మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: