ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ,స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం జాను. మొన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరుస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం 4.75కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 20కోట్లు రాబట్టాల్సి వుంది. అయితే ఇదే రన్ ను కొనసాగిస్తే బయ్యర్ల కు భారీ నష్టాలు తప్పలే లేవు.
ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు దాంతో అక్కడ కూడా జాను మినిమం కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోతుంది. ప్రస్తుతం వేరే సినిమాల తో పోటీ లేకున్నా వసూళ్లు తగ్గడం గమనార్హం. కేవలం మల్టీ ఫ్లెక్స్ ల్లోనే జాను హాజ్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. కోలీవుడ్ సూపర్ హిట్ కల్ట్ మూవీ '96' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్టర్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకుడు కాగా గోవింద్ వసంత సంగీతం అందించాడు. దిల్ రాజు నిర్మించాడు.
ఇక ఇటీవల వరుస పరాజయాలను చవి చూసిన శర్వానంద్ కు జాను కూడా కావాల్సిన హిట్ ఇచ్చేలా కనిపించడం లేదు. ఇదిలావుంటే శర్వా ప్రస్తుతం శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా రైతు పాత్రలో కనిపించనున్నాడు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపించంద్ ఆచంట ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో శ్రీకారం విడుదలకానుంది. ఇక సమంత మాత్రం 96 రీమేక్ తరువాత తెలుగు లోనే కాదు తమిళం లోకూడా మరో సినిమాకు సైన్ చేయలేదు.