అల వైకుంఠపురంలో వాయిదా.. బన్నీ ఫ్యాన్స్కు బిగ్ షాక్
స్టైలిష్ స్టార్ అభిమానులకు నిరాశ ఎదురైంది. వారు తమ అభిమాన హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమా ఇప్పటికే టీజర్లు, స్టిల్స్, సాంగ్స్ తో యూ ట్యూబ్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో సామజ వరగమన సాంగ్ అయితే ఏకంగా సౌత్ ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది.
ఓ సాంగ్ కు సినిమా రిలీజ్ కు ముందే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు ఈ సినిమా టీజర్ ఆదివారం రిలీజ్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆదివారం సంబురాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంతలోనే సడెన్ గా టీజర్ రిలీజ్ వాయిదా పడినట్టు వార్త వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. కుటుంబసభ్యుడిగా భావించే ఓ అభిమాని మృతి చెందడడంతో టీజర్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది.
'మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ఓ అభిమాని మృతి చెందారు. నూర్ బాయ్ మా అందరికీ ఓ కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. ఇలాంటి ఉహించని పరిణామాల వల్ల సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియచేయడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాం. 'అల.. వైకుంఠపురములో..' టీజర్ విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం' అని గీతా ఆర్ట్స్ పేర్కొంది.
ఏదేమైనా టీజర్ వాయిదా పడడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనా సినిమా సూపర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక బన్నీ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కోసం హ్యాట్రిక్కు రెడీ అవుతున్నారు. అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.