టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడు వెంకటేష్ ‘కళియుగపాండవులు’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీ విజయం తర్వాత మరికొన్ని యాక్షన్ భరిత సినిమాల్లో నటించారు. వెంకటేష్ నటించిన ‘గణేష్’ సినిమా అప్పట్లో సంచలనం సృస్టించింది. విజయాన్ని తన పేరులో ఉంచుకొని విక్టరీ వెంకటేష్ గా అభిమానులకు దగ్గరయ్యారు. ఆయన తర్వాత వారసుడిగా వెంకటేశ్ సోదరుడు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి ‘లీడర్’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.
ఈ మూవీ తర్వాత రానా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. అయితే హీరోగానే కాకుండా ఏలాంటి పాత్రకైనా సిద్దమైన రానా బాలీవుడ్ లో సెకండ్ హీరోగా నటించి మెప్పించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా నటించిన ‘బాహుబలి, బాహుబలి 2 ’ ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో భల్లాలదేవుడిగా రానా ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీతో రానా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కెరటం మూవీతో తెగులు తెరకు పరిచయం అయిన రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో మంచి పేరు సంపాదించింది. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది.
ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక టాలీవుడ్ రానా, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య లవ్ ఎఫైర్ ఉందన్న వార్తలు చానాళ్లుగానే చక్కర్లు కొడుతున్నాయి. గతంలో రానా, త్రిష ల మద్య లవ్ ఎఫైర్ నడిచిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రానా, రకూల్ కొన్ని ఈవెంట్స్ లో కలిసి ఉండటంతో వీరి మద్య ప్రేమాయణం కొనసాగుతుందని సోషల్ మీడియా కోడై కూసింది.
తాజాగా ఈ వార్తలపై స్పందించిన రకూల్ తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఈవెంట్స్ అన్న తర్వాత కలిసి ఉండాల్సి వస్తుంది..అంత మాత్రాన ప్రేమలో పడ్డట్టు ఎలా అవుతుందని ప్రశ్నించింది. తామిద్దరి ఇళ్లు కేవలం రెండు నిమిషాల్లో వెళ్లేంత దగ్గరగా ఉంటాయని, తాను సినిమాలకు పరిచయం కాకముందు నుంచే రానా తెలుసునని చెప్పింది. ఇద్దరమూ ఎన్నడూ డేటింగ్ కు వెళ్లలేదని తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం వేసిన రకూల్ తాను ఎవరితోనూ లవ్ లో పడలేదని, ఇంకా సింగిల్ గానే ఉన్నానని అంటోంది.