అనుష్క సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
ప్రస్తుతం తమిళం ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వెతుకుతున్న శ్రీరెడ్డి ఇటీవల రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లే వాళ్లనే టార్గెట్ చేస్తే విమర్శనాత్మకమైన కామెంట్ చేయడం మొదలు పెట్టి సోషల్ మీడియాలో తమిళ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఇటువంటి తరుణంలో ఇటీవల దీపావళి పండుగ రోజు సందర్భంగా తన ఇంటిలో పూజ చేసుకున్న సందర్భంలో తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి ఆ వీడియో కి ఓక అద్భుతమైన ఉపశీర్షిక ని కూడా తనదైన రీతిలో పెట్టుకున్నారు.
ఇకపోతే ఆ ఉపశీర్షిక అనేది ప్రస్తుతానికి సంచలనాలను సృష్టిస్తుంది. ఇంతకీ అదేంటంటే… “అందరు పసుపతుల కోసం నేను సరైన పనే చేశా. నా అమాయక మహిళలు అందరికీ నేను గద్వాల అరుంధతిని” అని కామెంట్ పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నిర్మాతలు అయిపోయారు రాజకీయ నాయకులు అయిపోయారు ఇప్పుడు హీరోయిన్ లను టార్గెట్ చేసావా..? శ్రీ రెడ్డి అంటూ కామెంట్లు చేస్తున్నారు.