పవన్ పై వస్తున్న ఫేక్ న్యూస్ కు తెరపడింది......!!

Mari Sithara
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే మధ్యలో తనకు తీరిక దొరికిన సమయాల్లో మాత్రం అత్యంత ముఖ్యమైన సినిమా ఫంక్షన్లు మరియు వేడుకలకు మాత్రం హాజరువుతున్నారు. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా పవన్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసితో, ఆయన సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఇక ఆ తరువాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని పవన్, ఇకపై సినిమాలు చేసే ఉద్దేశ్యం తనకు లేదని, తన రాబోయే జీవిత కాలం మొత్తం కూడా ప్రజాసేవకే అంకితం అని తెల్పడం జరిగింది. 

మొన్న ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడం, అలానే పవన్ గారు, పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓటమి పాలవడంతో, ఆయన రాజకీయాలు వదిలి మళ్ళి సినిమాల్లోకి వస్తున్నారు అనే వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. అయితే అటువంటిది ఏమి లేదని, పుకార్లు నమ్మవద్దని పలు మార్లు పవన్ ఆ తరువాత మాట్లాడుతూ చెప్పారు. ఇకపోతే మూడు రోజుల క్రితం మెగాస్టార్ లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా పవన్ హాజరవడం, అలానే మెగాస్టార్, మెగా పవర్ స్టార్, పవర్ స్టార్ ముగ్గురూ కలిసి ఎంతో ఆనందంతో ఫ్యాన్స్ ముందుకు రావడంతో మళ్ళి పవన్ సినిమాల్లోకి వస్తున్నారు అనే వార్తలు మరింతగా వైరల్ అవడం మొదలయ్యాయి. పవన్, చరణ్ ల కలయికలో అతి త్వరలో సినిమా రాబోతోందని, 

పవన్ మరియు చరణ్ లు ఇద్దరూ ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు రావడంతో, నేడు జనసేన పార్టీ అధికార విభాగానికి చెందిన కొందరు నాయకులు వీటిపై పూర్తిగా వివరణ ఇచ్చినల్టు తెలుస్తోంది. వారు చెప్తున్న ప్రకారం, పవన్ గారు మళ్ళి సినిమాల్లోకి వస్తున్నారు అనే వార్తలు పూర్తిగా అసత్యాలని, కావాలనే కొందరు ఆయనపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని, గతంలో వారు చెప్పిన విధంగానే ఆయన ఇకపై తన జీవితాన్ని ప్రజాక్షేత్రంలోనే గడుపుతారు అనే విషయాన్ని ఎందరూ గ్రహించాలని వారు గట్టిగా చెప్పారట. దీనితో పవన్ పై వస్తున్న ఆ పుకార్లన్నింటికీ ఒక్కసారిగా తెరపడ్డట్లైంది......!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: