పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
అయితే అధికారికంగా ఇండస్ట్రీ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇటువంటి క్రమములో మరో క్రేజీ ప్రాజెక్ట్ సినిమాలో నాగచైతన్య నటిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమా లో నాగచైతన్య పక్కన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ఈ సినిమాకి 'అదే నువ్వు అనే నేను' అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.
రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాని ఓ డెబ్యూ దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ కథని ముందుగా పొలిటికల్ లీడర్ టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ కోసం అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల నాగ చైతన్య వద్దకు ఈ ప్రాజెక్ట్ చేరినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ప్రస్తుతం మాత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో నాగచైతన్య బిజీగా ఉన్నాడు.