బంపర్ ఆఫర్ కొట్టేసిన సప్తగిరి..!
రెయిన్బో మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శైలేష్ వసందాని నిర్మిస్తున్నారు. ఇక కంచిలో సినిమాను పూజా కార్యక్రమాలతో మంగళవారం లాంచ్ చేశారు. దీంతో కమెడియన్ గా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ తెచ్చుకున్న సప్తగిరి ఈ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ హిట్ అందుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నాడు. గతంలో సప్తగిరి నటించిన సినిమాలకు కమర్షియల్ గా మంచి టాక్ రావటం అందరం చూశాం.
వరుసగా విజయావకాశాలను అందుకుంటున్న సప్తగిరి కి ఈ సినిమా స్టోరీ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. దీంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ చేయాలని సినిమా యూనిట్ రెడీ అయిపోయింది. మొత్తంమీద చూసుకుంటే 'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీలో సప్తగిరి హీరోగా చేయటం అంటే బంపర్ ఆఫర్ కొట్టినట్లు అని చాలామంది ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.