అభిమానులకు అతిలోక సుందరి 'శ్రీదేవి' దర్శనం రేపే ....!!

Mari Sithara
బాలనటిగా పలు సినిమాల్లో నటించిన శ్రీదేవి, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా తెలుగు సహా పలు ఇతర భారతీయ భాషల్లో ఎన్నెన్నో పాత్రల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కళ్ళు  మిరుమిట్లు గొలిపే అందం మరియు అద్భుత నటనతో అభిమానులనుండి అతిలోకసుందరి ఆనే పేరు సంపాదించారు శ్రీదేవి. కేవలం అందమే కాదు, శ్రీదేవి అభినయానికి ఇప్పటి హీరోయిన్స్ లో ఏ ఒక్కరూ కూడా సాటి రారు అనేది చాలా మంది చెప్పే మాట. ఏడాదిన్నర క్రితం మనల్ని అందరిని విడిచి ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారు. 

అయితే ఇప్పటికీ కూడా ఆమె అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఇకపోతే శ్రీదేవి అభిమానులకు ఇటీవల సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఒక పండుగ వార్త చెప్పారు. అతిలోక సుందరి శ్రీదేవి మైనపు ప్రతిమను తయారుచేయడం మొదలుపెట్టడం జరిగిందని, అతి త్వరలో దానిని  గ్రాండ్ లెవెల్లో ఆవిష్కరిస్తామని ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ న్యూస్ బయటకు వచ్చిన తరువాత శ్రీదేవి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇక నేడు శ్రీదేవి భర్త బోనీ కపూర్, భౌతికంగా తను మన మధ్య లేనప్పటికీ, ఎల్లప్పుడూ మన మనసులోనే గూడు కట్టుకుని ఉంటారు, 

రేపే ఆమె సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో ఆమె మైనపు విగ్రహావిష్కరణ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పటికే అమితాబ్, షారుఖ్, అమీర్ ఖాన్, సల్మాన్, ఐశ్వర్య రాయ్ మరియు మరికొందరు ఇతర నటుల మైనపు ప్రతిమలు మేడం టుస్సాడ్స్ లో కొలువుతీరగా, రేపు అతిలోకసుందరి శ్రీదేవి ప్రతిమ కూడా వారి ప్రతిమల సరసన చేరనుంది. ఇక ఇండియా సహా పలు ఇతర దేశాల్లోని కొందరు శ్రీదేవి ఫ్యాన్స్, తమ అభిమాన నటి మైనపు విగహాన్ని వీక్షించడానికి ఇప్పటికే సింగపూర్ వెళ్ళడానికి సిద్ధమయినట్లు సమాచారం. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ సహా పలు సినిమా ఇండస్ట్రీల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!! 


Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForever pic.twitter.com/AxxHUgYnzt

— Boney Kapoor (@BoneyKapoor) September 3, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: