హీరోయిన్గానే కాకుండా మంచి సింగర్గా కూడా సౌత్లో పాపులర్ అయ్యింది ఆండ్రియా జెరెమియా. కోలీవుడ్లో కమల్హాసన్ నుంచి ధనుష్, విశాల్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టి హిట్లు కొట్టిన ఆండ్రియాకు సూపర్ హిట్ సాంగ్ల ద్వారా అటు తమిళ్, ఇటు తెలుగులోనూ ఎంతో మంది మదిని గెలుచుకుంది.
ధనుష్ ‘వడ చెన్నై’ సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించిన ఆమె గత కొంతకాలంగా ఎక్కడా కనపడడం లేదు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఆండ్రియా నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆమెకు ఏమైందా ? అని ఆరా తీశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో తాను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయానని... దాని నుంచి కోలుకుని ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది.
బెంగళూరులో తన కవితల సమ్మేళనం అయిన ‘బ్రోకెన్ వింగ్స్’ను ఆవిష్కరించారు. కొన్ని కవితలు చాలా హార్ట్ టచ్చింగ్గాను, చాలా ఎమోషనల్గాను ఉండడంతో కొందరు శ్రోతలు వీటిపై ఆండ్రియాకు పలు ప్రశ్నలు వేశారు. వీటికి ఆమె సమాధానం ఇస్తూ కొంతకాలంగా తాను ఓ వివాహితుడితో రిలేషన్షిప్లో ఉన్నానని... అతడు తనను మానసికంగాను, శారీరకంగాను తీవ్రంగా వేధించాడంతో తాను తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యానని చెప్పింది. దీంతో కెరీర్ పరంగా కూడా తాను ఎంతో కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆయుర్వేద చికిత్స ద్వారా ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకుని ఇప్పుడే సినిమాలు చేస్తున్నట్టు కూడా చెప్పింది. ఏదేమైనా ఆండ్రియా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఆమె ఎఫైర్ పెట్టుకున్న ఆ వివాహితుడు ఎవరు ? ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా ? బయట వ్యక్తా ? అన్న సందేహాలు వస్తున్నాయి. కొందరు మాత్రం ఆమె సినిమాలు చేసిన ఓ యువ హీరోయే అయ్యి ఉంటాడని చర్చించుకుంటున్నారు.