సైరా కథ చెప్పనున్న స్వీటీ

మెగా అభిమానులు, టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సైరా సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌గా కొన సాగుతోంది. ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది దసరా కు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న నిర్మాత రామ్ చరణ్, ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు కూడా కొంత కాలంగా వినిపిస్తు న్నాయి. సురేందర్ రెడ్డి సైతం దసరాకు సినిమా విడుదల చేసేలా షూటింగ్‌ ను ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. 

19వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌ క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు కీలక పాత్ర లు పోషిస్తుండగా, నయనతార, తమన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో నేరుగా కథలోకి వెళ్లకుండా ఎవరో ఒక వ్యక్తి చేత చెప్పించాలని దర్శకుడు భావిస్తున్నాడట.

ఈ కథ చెప్పే ఆ వ్యక్తి విషయంలో కూడా ఆయనొక నిర్ణయానికి వచ్చారట. బాహుబలి తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వీటీ అనుష్క తోనే సైరా కథ చెప్పిస్తే బహు పసందుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే వాళ్లు అనుష్కను సంప్రదించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు వాయిస్ ఇచ్చే విషయంలో అందాల భామ అనుష్క తేల్చవలసి ఉందని సినీ వర్గాల నుండి సమాచారం.  సినిమా కథను ప్రేక్షకులకు పరిచయం చేసే వ్యాఖ్యాతగా అనుష్కను ఎంచుకున్న చిత్ర దర్శక నిర్మాతలు, ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిపారని సమాచారం.
అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఆమె నుంచి ఎలాంటి గ్రీన్-సిగ్నల్ రావలసి ఉందదని వ్యాఖ్యాతగా వాయిస్ ఇవ్వడంతో పాటు మధ్యలో ఒక చిన్న కీలక పాత్రను కూడా మూవీ మేకర్లు అనుష్కకు ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోంది.  గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమాకు చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాకు అది కొంతమేర కలిసొచ్చింది కూడా. అప్పట్లో తన సినిమాకు మెగాస్టార్ చేసిన సాయానికి మంగుళూరు ముద్దు గుమ్మ ఋణం తీర్చుకుంటుందా? లేక సైరా వాయిస్ ఆఫర్‌ ను లైట్ తీసుకుంటుందా? అన్నది టాలీవుడ్‌ లో ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: