జగన్‌ను ఆ హీరో ఎందుకు కలిశాడబ్బా..? తండ్రికి ఎంపీ టిక్కెట్..?

Chakravarthi Kalyan

అసలే ఎన్నికల సీజన్.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం చాలా సందడిగా ఉంది. ఇటీవల టీడీపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇలాంటి సమయంలో జగన్ ను ఓ సినీహీరో కలవడం కలకలం రేపింది. ప్రముఖ నటుడు మంచు విష్ణు విపక్ష నేత జగన్ ను కలవడం ఆసక్తికరంగా ఉంది.



విష్ణు ..జగన్ ను బందుత్వ రీత్యా కలిశారా? లేక పార్టీపరంగా రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశంతో కలిశారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ కు విష్ణు భార్య వెరోనికా సమీప బందువు అవుతారు. లోట్‌సపాండ్‌ వద్ద ఉన్న జగన్‌ నివాసానికి విష్ణు గురువారం సతీసమేతంగా వచ్చారు.



జగన్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడకుండానే విష్ణు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఎందుకు కలిసి ఉంటారా అన్నది ఆసక్తికరంగా ఉంది. విష్ణు మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు అన్న సంగతి తెలిసిందే.



నటుడు మోహన్ బాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో టీడీపీ తరపున ఎంపీగా కూడా పని చేశారు. ఇప్పుడు జగన్ తో ఉన్న బంధుత్వం రీత్యా ఆయన వైసీపీ నుంచి ఎంపీ బరిలో దిగే అవకాశాలు కూడా ఉండొచ్చంటున్నారు. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: