తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న తమిళ హీరో సూర్య. గజిని చిత్రం తర్వాత సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సూర్యకి ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న విపత్తు వచ్చినా సూర్య విరాళం ఇవ్వడంలో ముందు ఉంటారు. ఇలా ఎన్నోమార్లు విరాళం ఇచ్చి తన మంచి తనాన్ని చాటుకున్నారు.
సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే' (నంద గోపాలన్ కుమరన్) రూపొందుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. సూర్య పాత్రకి సంబంధించి పూర్తి భిన్నమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేయడం వలన చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది.
సూర్య పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో రకూల్, సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో సూర్య వున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే ఆశతో వున్నారు.