తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్. గత కొంత కాలంగా అజిత్ నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల శివ దర్శకత్వంలో అజిత్, నయనతార జంటగా ‘విశ్వాసం’చిత్రం రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ చేశారు. తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుంది.
తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెట్టా చిత్రానికి గట్టి పోటీ ఇచ్చి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంతవరకూ 180 కోట్లను వసూలు చేసింది.అయితే పెట్టా సందడి కాస్త తగ్గినప్పటికీ..బీసీ సెంటర్లలో ‘విశ్వాసం’జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇదే జోరు కొనసాగితే మరికొన్ని రోజుల్లో ఈ చత్రం రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలోనే అజిత్ కూడా భారీ విజయాన్నే సొంతం చేసుకున్నాడు.