చరణ్ మిస్సింగ్ వార్తలకు కలవరపడుతున్న మెగా అభిమానులు !

Seetha Sailaja
ఈవారం విడుదలకాబోతున్న ‘వినయ విధేయ రామ’ ‘రంగస్థలం’ మించి రికార్డులు క్రియేట్ చేస్తుందని చరణ్ అభిమానులు కలలు కంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీలో చరణ్ సుమారు 20 నిముషాలు కనిపించడు అని వస్తున్నవార్తలు మెగా అభిమానులను కలవర పాటుకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించి ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుందని టాక్. ఆఫ్లాష్ బ్యాక్ లో విలన్ తో హీరో ఫామిలీకి క్లాష్ ఎలా వచ్చింది అన్న సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. సుమారు 20 నిముషాలు కొనసాగే ఆఫ్లాష్ బ్యాక్ కథలో చరణ్ ఎక్కడా కనిపించడు అని లీకులు వస్తున్నాయి. 

ఆసీన్స్ లో చిన్నప్పటి చరణ్ మాత్రమే కనిపిస్తాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి చిన్నప్పటి పాత్రలో ఉన్న చరణ్ విలన్ పై పగ పెంచుకుంటాడు. ఇప్పటికే అనేక కమర్షియల్ సినిమాలలో ఇలాంటి రొటీన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చాయి. అయితే ఈ రొటీన్ కథకు బోయపాటి తన మార్పు స్క్రీన్ ప్లేతో యాక్షన్ సీన్స్ దట్టించి భారీ బడ్జెట్ తో ‘వినయ విధేయ రామ’ ను తీసాడు. 

అయితే ఒక కమర్షియల్ సినిమాలో ఏకంగా ఒక టాప్ హీరో 20 నిముషాలు స్క్రీన్ పై కనిపించకపోతే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అనే విషయమై మెగా అభిమానులకు సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక మాస్ సినిమాకు సాఫ్ట్ టైటిల్ పెట్టి చరణ్ పై ప్రయోగాలు చేస్తున్న బోయపాటి ఏకంగా ఈమూవీలో చరణ్ ను 20 నిముషాలు కనపడనీయకుండా సైడ్ లైన్ చేయడం ఎంతవరకు మాస్ ప్రేక్షకులు అంగీకరిస్తారు అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: