కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘గీతాగోవిందం’!

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలతో భారీ కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే.  రంగస్థలం, భరత్ అనే నేనూ, మహానటి సూపర్ డూపర్ హిట్ కావడంతో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టాయి.  రాంచరణ్ నటించిన రంగస్థలం, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాయి.  ఇక మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ‘మహానటి’ కూడా భారీ కలెక్షన్లే రాబట్టింది.  ఈ చిత్రాల తర్వాత కాస్గ గ్యాప్ తీసుకున్నా ఈ మద్య రిలీజ్ అయిన ఆర్ ఎక్స్ 100, గూఢచారి చిత్రాలు కూడా పది కోట్లు దాటి వసూళ్లు చేశాయి. 

తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతాగోవిందం’సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా విపరీతంగా వస్తున్నాయి. గీత గోవిందం ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 37.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

కేవలం ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 10.04 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే..ప్రివ్యూ నుంచి ఈ చిత్రం ఓవర్సీస్ లో దుమ్మురేపుతుంది.  3 రోజుల్లో 5.65 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ  సినిమా 50 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: