చిరంజీవి 150వ సినిమాగా మనం !

Seetha Sailaja
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తనకు అన్నివిధాల నచ్చే కధ తెచ్చి ఇచ్చిన వారికి కోటి రూపాయల పారితోషికం ఇస్తాను అని ప్రకటించిన నేపధ్యంలో చిరంజీవితో సినిమాను తీద్దాము అనుకున్న టాప్ దర్శకులతో పాటు యువ రచయితలు కూడా తమతమ స్థాయిలో చిరంజీవికి కధలు చెపుతూ మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ సందర్భంలో ఒక యువ రచయిత తన మిత్రులైన మరో ఇద్దరు రచయితలతో కలిసి ఒక వెరైటీ కధను రాసుకుని అతి కష్టం పై చిరంజీవిని కలిసి ఆ కధను వినిపించినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కధ వెరైటీగా అనిపించినా ఈ సంవత్సరం విడుదలై సంచలనం సృస్టించిన ‘మనం’ పోలికలు అక్కడక్కడా కనిపిస్తాయట.  ఈ కధలో రెండు తరాల పాత్రలలో చిరంజీవి కనపడేట్లుగా రాసిన ఈ కధలో కొన్ని ప్రాముఖ్యత ఉన్న పాత్రలలో మెగా కుటుంబంలోని యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు చరణ్ బన్నీలు అతిధి పాత్రలుగా కనిపించే ఈ కధను ఆ యువ రచయిత చిరంజీవికి వినిపిస్తే చిరు అత్యంత ఆశక్తిగా విన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా వినపడుతున్న వార్తలు మటుకు ఆశక్తిని కలిగిస్తూ అక్కినేని కుటుంబం చేసిన ప్రయోగం మెగా కుటుంబం అనుసరిస్తుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. రానున్న రోజులలో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఇలాంటి విచిత్ర వార్తలు ఇంకా ఎన్ని వినాలో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: