తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాల హంగామా మొదలైంది..ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎటువంటి సినిమా చేసిన కూడా అవి బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ ను అందుకోవడంతో ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు.ఇటీవల రామ్ చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం తెరకెక్కగా, ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక త్వరలో రామ్ చరణ్.. అల్లు అర్జున్తో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ లీక్ చేశారు. బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల సందర్బంగా కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న అలీతో సరదాగా షోకు అతిథిగా వచ్చేశారు.
ఈ షోలో ,చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అరవింద్. పుష్ప సినిమా బన్నీకి తనకు.. ఇద్దరికీ మైల్ స్టోన్ లాంటిందని.. ఈ మూవీతో బన్నీ నేషనల్ స్టార్ కావడం చాలా తృప్తిగా ఉందని తెలిపారు.అలాగే తమ బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేసింది కచ్చితంగా చిరంజీవి గారే అని. తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే అని అన్నారు. మగధీర సినిమా తనకి మంచి సంతృప్తిని ఇచ్చిందని కూడా పేర్కొన్నారు. ఇక ఇటీవలే ఈయన కన్నడ బ్లాక్బస్టర్ 'కాంతారా' సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, ఈ సినిమా మొదటి రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని అల్లు అరవింద్కు లాభాల పంట పండిస్తుంది..
రామ్ చరణ్, అల్లు అర్జున్ల తో కలిసి మల్టీస్టారర్ చేయాలనుందని వెల్లడించాడు. ఇందుకోసం దాదాపు 10 ఏళ్ల క్రితమే 'చరణ్-అర్జున్' అనే టైటిల్ను రిజిస్టర్ చేసినట్లు తెలిపాడు. ప్రతీ ఏడాది ఆ టైటిల్ను రిన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో చరణ్, బన్నీ కలిసి ఎవడు అనే సినిమా చేశారు. అయితే అందులో బన్నీ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తే ఆ సందడే వేరు. ప్రస్తుతం చరణ్, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్గా దూసుకుపోతున్నారు. బన్నీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు..చెర్రి కూడా శంకర్ సినిమా తో బిజీగా ఉన్నాడు..