బాలయ్య ను పక్కన పెట్టాడా... మహేష్ తోనే..!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుంది అని బాలకృష్ణ అభిమానులు నమ్ముతున్నారు. ఆయన గత చిత్రం అఖండ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందొ అందరికీ తెలిసిందే. అంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. 

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాలయ్య స్థాయిలోనే చిత్రాన్ని రూపొందిస్తూ ఉండటం విశేశం. ఓ వైపు ఈ సినిమాను చేస్తున్న బాలకృష్ణ ఇంకొక వైపు తన తదుపరి సినిమా గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నలుగురైదుగురు దర్శకులతో కలిసి తన తదుపరి సినిమా గురించి చర్చించినట్లుగా వార్తలు వినిపించాయి. వీటిలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఆయన సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు రాదా తాజాగా అనిల్ రావిపూడి మహేష్ బాబు తో చేస్తున్నాడు అనే వార్తలు రావడం బాలకృష్ణ అభిమానులను కలవర పెడుతోంది.

తన సినిమాలను ఎంతో జాగ్రత్తగా చేసి ప్రేక్షకులను అలరించే అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు బాలకృష్ణ కూడా ఆ విధంగా ఆలోచించే అనిల్ రావిపూడి తో చర్చలు జరిపాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ బాబు మధ్య లోకి ఎంటర్ కావడం ఈ సినిమా ఉందో లేదో అన్న అనుమానాలను వ్యక్తపరుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎఫ్ 3 సినిమా విడుదల కార్యక్రమాలలో ఉన్న అనిల్ రావిపూడి ఆ చిత్రం తర్వాత తాను ఎవరితో సినిమా చేస్తాను అన్నది వెల్లడించనున్నాడు. ఇప్పటికే మహేష్బాబుతో ఓ సినిమా చేసి ఆయనకు మంచి విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి మరొక విజయాన్ని అందించాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: