వివాహానికి సిద్ధమైన మరో టాలీవుడ్ హీరోయిన్..?

Divya
గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలు వరుసగా పెళ్లి భాజలు మోగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఎక్కువ మంది ఆ వైపుగానే అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లో పెళ్లిల హవా ఎక్కువగా కొనసాగు తోంది.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. రకుల్ ప్రీతిసింగ్, జాకీ భగ్ననీ..అదితి రావు హైదరి , తమన్నా తదితర బుల్లితెర నటి నటులు కూడా వివాహానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక టాలీవుడ్ హీరోయిన్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు మేఘ ఆకాష్.. నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనురాగౌపుడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత నితిన్ తో కలిసి మరొకసారి ఛల్ మోహన్ రంగా అనే చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసి అక్కడ స్టార్ హీరో అయిన రజినీకాంత్ నటించిన పేట సినిమాలో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో పెళ్లి పీటలు లేకపోతోందని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో మేఘ ఆకాష్ ఒక పోస్ట్ షేర్ చేస్తూ వెడ్డింగ్ వైబ్స్ అంటూ రాసుకు వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ వివాహానికి సిద్ధమయ్యిందని ప్రచారం అయితే బాగా వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోబోతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మేఘా ఆకాష్ తెలియజేస్తే తప్ప అసలు విషయం బయటపడదు. ప్రస్తుతం ఈ మద్దుగుమ్మకు సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: