గోపీచంద్ సినిమా లో ఒక్క పాటకే అంత ఖర్చా..!

Pulgam Srinivas
గోపీచంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్, ఈ సినిమా లో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కంటే ముందే ప్రారంభం అయిన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటుంది, ఈ సినిమా ప్రారంభించిన తర్వాత దర్శకుడు మారుతి, సంతోష్ శోభన్ హీరో గా మెహరిన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాను ప్రారంభించాడు, ఆ సినిమా పనులను పూర్తి చేసి కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల కూడా చేశాడు. అలా మంచి రోజులు వచ్చాయి సినిమా వల్ల పక్కా కమర్షియల్ సినిమా కాస్త ఆలస్యం అయ్యింది, అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను,  టీజర్ లను, చిత్ర బృందం బయటికి వదలగా వీటికి జనాలు నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమా పై మంచి అంచనాలు కూడా పెంచాయి.

 ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది, కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ లో రాశి కన్నా తన డైలాగ్ మరియు ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది జడ్చర్ల మనసు దోచుకుంది. ఈ సినిమా ను భారీ ఖర్చు తో యు వి క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా కు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం చిత్ర బృందం కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెట్ ను వేసినట్లు తెలుస్తోంది, పక్కా కమర్షియల్ సినిమా గోపీచంద్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. ఇలా ఒక పాట కే ఇంత ఖర్చు పెట్టారు అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని  కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: