టివి: తెలుగు యాంకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ వింధ్య..!

Divya
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వింధ్య విశాఖ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించిన సుమని ఇన్స్పైర్గా తీసుకొని యాంకర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిందట. ప్రస్తుతం తెలుగులో పలుషోలు చేస్తూ సినిమాలలో కూడా నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది వింధ్య.. టాలీవుడ్ లో ఉండే యాంకర్స్ సైతం వారి షోలతో దూసుకుపోతూ ఉంటే వింధ్య మాత్రం స్పోర్ట్స్ వైపుగా తన అడుగులు వేసింది.. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు ఆమె హోస్టుగానే వ్యవహరిస్తున్నది.

స్పోర్ట్స్ వంటి వాటికి యాంకర్ గా చేయడం అది కూడా తెలుగులో చాలా తక్కువగానే ఉంటారు. ఆ ఘనత మాత్రం యాంకర్ వింధ్య అందుకున్నది. కానీ సినిమా రంగంలో మాత్రం ఈమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా వింధ్య.. ముఖ్యంగా యాంకర్ సుమ వంటి వారు ఎక్కువగా అన్ని షోలను చేస్తూ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నారని ఈ విషయం పైన మీ స్పందన ఏంటి అంటూ యాంకర్ వింధ్యని అడగగా..

అందుకు వింధ్య సమాధానం తెలియజేస్తూ సుమ అక్క అంటే తనకు చాలా ఇష్టమని ఆమెను కలిసినప్పుడల్లా సరదాగా నవ్వుకుంటూ ఉంటాము.. ఫన్నీ గానే నాకు కొన్ని షోలు వదలచు కదా అంటూ ఉంటాను.. సుమ అక్కకి ఎక్కువగా షోలు వస్తాయనే మాట వాస్తవమే.. కానీ ఒకవేళ ఆఫర్స్ మనకి వస్తే ఆమె లాగా మేనేజ్ చేయలేమని కూడా తెలియజేసింది. ముఖ్యంగా ఎవరైనా స్టార్ హీరోల సినిమాలకు యాంకర్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా కీలకంగా వ్యవహరించాలి. ఎలాంటి మిస్టేక్లు లేకుండా ఈవెంట్ ని నడిపిస్తుంది కాబట్టే అంతటి రెమ్యూనికేషన్ ఇచ్చి ఆమెను తీసుకుంటారని తెలిపింది వింధ్య.

అయితే మరి కొంతమంది యాంకర్స్ ఉన్నారు వారు బూతులు డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అవ్వాలనుకుంటూ ఉంటారు. కానీ తెలుగే సరిగ్గా మాట్లాడలేరని తెలుపుతోంది. అలాగే ఈవెంట్స్ లో డబుల్ మీనింగ్ సెటైర్లు వేస్తూ ఉంటారు అందుపైన మీ ఒపీనియన్ ఏంటి అని అడగగా.. అందుకు వింధ్య ఉదాహరణకు వర్మ వంటి వారు ఈవెంట్ కు వస్తే కచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడుతాను ఆయనతో ఎక్కువగా చనువు గా ఉండను.. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడుతారో నాకు బాగా తెలుసు చనువు ఇస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారని అందుకే వర్మ గారికి నేను అంత సీన్ ఇవ్వకుండా జస్ట్ వర్మ గారిని వేదిక పైన పిలిచి మాట్లాడాలని చెబుతానని తెలిపింది. మన లిమిట్స్ లో మనం ఉంటే ఎవరు మన వల్లే టచ్ చేయలేరని తన ఉద్దేశమని వింధ్య తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: