ఇదేందయ్యా ఇది.. మెట్రో రైళ్లూనూ నేతల ప్రచారం?

Chakravarthi Kalyan
ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు ఏ అవకాశాన్ని కూడా నేతలు వదులుకోరు. వింత వింత ప్రయత్నాలు చేస్తారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు అలాంటి ప్రయత్నమే హైదరాబాద్‌లో చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మెట్రో రైలులో ప్రయాణించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి... రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎల్బీనగర్‌ నుంచి కూకట్‌పల్లికి మెట్రోలో ప్రయాణించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ తర్వాత కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే కూకట్‌పల్లి మెట్రోస్టేషన్‌లో ఉన్న మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు వీళ్లకు స్వాగతం పలికారు. అందరూ కలిసి మెట్రో స్టేషన్‌ నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజా రవాణాను మెరుగుపర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు. ఎంపీ ఎన్నికల్లో భారాసకే ఓటు వేయాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: