మెగా ఆహాలోకి బాలయ్య ఎంట్రీ వెనక చక్రం తిప్పింది ఎవరంటే..!
ఇక ఇటు తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ యువరత్న నందమూరి బాలకృష్ణ మధ్య ఎలాంటి యుద్ధం నడిచేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య వర్సెస్ చిరంజీవి మధ్య వార్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు వీరి సినిమాలు పోటీ పడుతున్నాయంటే బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.
అలాంటిది వారిద్దరిని కలిసి ఒక స్క్రీన్ మీద చూపించే సాహసం కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. అయితే అల్లు అరవింద్ చక్రం తిప్పి యువరత్న నందమూరి బాలకృష్ణ ను చిరంజీవిని ఒకే స్క్రీన్ మీదకు తీసుకు వస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నదే. దీని వల్ల ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఏర్పడడంతో పాటు మిగిలిన హీరోల మధ్య మంచి వాతావరణం ఏర్పడి.. వారు కూడా భవిష్యత్తులో మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు దోహ ద పడుతుంది.
మరి తమ అభిమాన హీరోలు చిరు, అటు బాలయ్య ఒకే స్క్రీన్ మీద సందడి చేయడంతో పాటు ఎలాంటి రచ్చ షురూ చేస్తారో ? అని ఆ ఇద్దరు హీరోల అభిమానులే కాకుండా కోట్లాది మంది తెలుగు సినీ , బుల్లితెర అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.