ఇప్పటి వరకు విడుదల తేదీ ప్రకటించిన క్రేజీ సినిమాల షెడ్యూల్..!

Pulgam Srinivas
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లను చాలా రోజుల పాటు మూసి ఉంచారు. కొన్ని రోజుల క్రితం నుండే థియేటర్లను ఓపెన్ చేసినప్పటికీ జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు మారాయి థియేటర్లోకి జనాలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యే సెప్టెంబర్ 10న విడుదలైన 'సిటీ మార్' సినిమా దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకు పోతుంది. అయితే 'సిటీ మార్' సినిమా ఇచ్చిన జోష్ లోనే మిగతా వెయిటింగ్ లో ఉన్న సినిమాలను కూడా థియేటర్ల లోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు విడుదల తేదీలను ప్రకటించిన క్రేజీ మూవీస్ లిస్ట్ ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది 'లవ్ స్టోరీ' నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుండి మంచి ఆసక్తిని నెలకొల్పింది. మరియు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ జనాల నుండి మంచి ఆదరణను దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 24వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'రిపబ్లిక్' సినిమాను అక్టోబర్ 1వ తేదీన థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని అక్టోబర్ 8వ తారీఖు తేదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు పోటీగా పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కొండపొలం' చిత్రం అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహాసముద్రం' సినిమా కూడా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: