కియార ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా!!

P.Nishanth Kumar
బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్న కథానాయిక కియర అద్వానీ. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అను నేను సినిమా ద్వారా టాలీవుడ్ కి ప్రవేశించి ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నాలు చేయగా ఆమె నటించిన రెండవ సినిమా వినయవిధేయరామ చిత్రం భారీ ఫ్లాప్ కావడంతో ఆమె మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి వెనుకబడింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ సినిమాలు చేసుకుంటూ వచ్చింది ఇన్నినాళ్ళు.

తాజాగా ఆమెకు తెలుగులో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని పొందింది. ఇప్పటికే చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా ఇటీవలే అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్ గా ఈ సినిమా ప్రారంభోత్సవం జరగగా చిత్రం విడుదల చేసిన పోస్టర్ లో సూట్ లో ఈమె కనిపించి ఆమె అభిమానులను ఎంతగానో అలరించింది. ఆమెకు తెలుగులో అవకాశం రావడం ఏమో గానీ మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ అనగానే ఎంతో టెన్షన్ పడుతున్నారు.

వరస పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న రామ్ చరణ్ రాజమౌళి సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన తదుపరి సినిమాలను ఎంతో చక్కగా ఎంచుకున్నాడు అని అనుకుంటుండగానే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ అని అనౌన్స్ చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన వినయ విధేయ రామ సినిమా భారీ ఫ్లాప్ కాగా ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుద్దో అని మెగా అభిమానులు భయపడుతున్నారు. మరి కియారా ఈ సెంటిమెంట్ ను మార్చి హిట్ కొడుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: