జనసేన: ప్రచారానికి మెగా హీరోలు దూరమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయాలు అత్యంత రసవత్తంగా మారుతున్నాయి ముఖ్యంగా ఎటు చూసిన రాజకీయ పార్టీలు ప్రచారాలు కూడా చేసుకుంటూ ఎవరి డప్పు వారు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్టార్ క్యాంపెనర్లుగా గతంలో తెరమీదకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదు మెగా హీరోలు.. దీంతో ఈ ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రాలో ఎన్నికలు ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితిలకు చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికల మీదే ఆధారపడి ఉంది.

ఈసారి ఎన్నికలలో గెలవాలని చాలా సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా కదులుతూ ఉన్నారు. తన నియోజకవర్గంలోనే కాకుండా ఇతరు నియోజకవర్గాలలో కూడా పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో కూడా ప్రచారం చాలా కీలకమైనది. ఇలాంటి సమయంలోనే పిఠాపురంలో ఆయన తరపున ప్రచారానికి మెగా కుటుంబం లోని హీరోలు యాక్టివ్ అవ్వాల్సి ఉండగా అయితే వారు ఎక్కడా కనిపించడం లేదు.. కేవలం జబర్దస్త్ బ్యాచ్ తోనే ప్రచారం చేస్తున్నారు జనసేన పార్టీ నేతలు.

ఇప్పుడు రాజకీయ పరిస్థితులలో వీరి ప్రచారం మాత్రం అసలు సరిపోదు.. మరొకపక్క నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ చాలామంది హీరోలే మెగా కుటుంబంలో ఉన్నారు. వారెవరు ఎందుకు రావడం లేదని ప్రశ్న ఇప్పుడు మెగా అభిమానులలో మొదలయ్యింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇతర హీరోలతో పాటు మెగా హీరోల తమ సినీ కెరియర్ ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమా సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటుందో అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యింది. పిఠాపురంలో మెగా హీరోలు సందడి చేస్తే మరింత ఊపునిస్తుందని అక్కడి నేతలు అభ్యర్థులు సైతం తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కూడా మెగా ఫాన్స్ మద్దతు కోరుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: