ముంబైలో ల్యాండ్ అయిన "కుబేర" యూనిట్..!

MADDIBOINA AJAY KUMAR
తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుండగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రూపొందిస్తున్నారు.
 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా బాగా కంప్లీట్ కూడా అయింది. ఇప్పటికే ఈ మూవీ నుండి ఇ మూవీ యూనిట్ ధనుష్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా అది చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఒక్క సారిగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ మూవీ పై అంచనాలు పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ను ముంబై లో ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ముంబై లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు అవి ఈ మూవీ కే హైలైట్ నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై తమిళ , తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీలో నాగార్జున నటిస్తూ ఉండడం ఈ మూవీ కి ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: