ఇక కఫం ఊపిరితిత్తుల్లో పేరుకుపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ఈ కఫాన్ని తొలగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా మన వంటింట్లో ఉండే పదార్థాలతో డికాషన్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఈజీగా ఈ కఫం సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించే డికాషన్ ను ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అలాగే దీనిని ఎలా వాడాలి వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈ డికాషన్ ను తయారు చేసుకోవడానికి మనం అర లీటర్ నీటిని, 3 ఇంచుల అల్లం ముక్కను, 6 బిర్యానీ ఆకులను, 7 లవంగాలను ఇంకా 4 టేబుల్ స్పూన్ల తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులను తుంచి వేసుకోవాలి.
ఆ తరువాత ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత లవంగాలు వేసి మరో 3 నుండి 4 నిమిషాల పాటు అలాగే మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిని పూర్తిగా చల్లారే దాకా అలాగే ఉంచాలి. ఆ తరువాత ఇందులో తేనె కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల డికాషన్ ఈజీగా తయారవుతుంది.
ఈ డికాషన్ ను గాజు సీసాలో పోసుకుని ఫ్రిజ్ లో ఉంచి వారం రోజుల పాటు వాడుకోవచ్చు. ఇక ఈ డికాషన్ ను పెద్దలు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో అలాగే పిల్లలు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.ఇంకా ఈ డికాషన్ ను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో గ్లాసులోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక కప్పు గోరు వెచ్చని నీటిని పోసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఈ విధంగా డికాషన్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల గొంతులో ఇంకా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం చాలా సులభంగా తొలగిపోతుంది.మనకు శ్వాస తీసుకోవడం వల్ల సులభతరం అవుతుంది.