కిడ్నీలని క్లీన్ చేసే ఫుడ్స్ ఇవే?

Purushottham Vinay
మన కిడ్నీలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తినడం చాలా అవసరం.. కిడ్నీ సమస్యలు ఉంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదని చాలా మంది భావిస్తారు. కానీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు అవసరం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు. కిడ్నీ ఆరోగ్యానికి సోయా, బాదం పాలు, టోఫు, బలవర్థకమైన తృణధాన్యాలు తప్పకుండా తినండి.కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ఈ రసాలను కూడా చేర్చుకోవడం మంచిది. మీకు కిడ్నీ సమస్యలు ఉంటే, మీ ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోండి.సాయంత్రం అల్పాహారంగా కొన్ని ఎర్ర ద్రాక్షలను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇందులో ఉండే రెస్వెరాట్రాల్ సమ్మేళనం కిడ్నీ వాపు ఇంకా చికాకును తగ్గిస్తుంది.అలాగే కిడ్నీలను శుభ్రం చేయాలనుకుంటే ఆరెంజ్ జ్యూస్ తయారు చేసి తాగండి.


విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ కలిగిన ఈ పండు చాలా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఆగిపోతుంది.ఇంకా అలాగే పుచ్చకాయ, క్యారెట్, దోసకాయల రసాన్ని అల్పాహారంగా త్రాగాలి. కిడ్నీలోని మురికిని బయటకు పంపడంలో ఈ జ్యూస్ చాలా సహాయపడుతుంది.బీట్‌రూట్, నిమ్మరసం, చిన్న అల్లం ముక్కలను కలపండి. వీటని జ్యూస్ గా తయారు చేసుకోండి.. తర్వాత ఈ జ్యూస్‌ని ఉదయాన్నే వడగట్టి తాగడం వల్ల కిడ్నీలోని మురికి తొలగిపోతుంది.కిడ్నీలను డిటాక్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ జ్యూస్ లను తాగండి.. వీటితో మన కిడ్నీలను ఈజీగా శుభ్రంచేసుకోవచ్చు.. కిడ్నీలను డిటాక్స్ చేయడానికి ఇవి ఖచ్చితంగా తాగండి.కిడ్నీ ఆరోగ్యం పట్ల చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు.దీని వల్ల కిడ్నీలో మురికి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో కిడ్నీల్లో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభించిన వెంటనే ఆహారంలో ఖచ్చితంగా పైన చెప్పిన మార్పులు చేసుకోవాలి. అందువల్ల కిడ్నీల్లోని మురికిని సులభంగా తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: