పనస పండు అనేది చూసేందుకు పైకి భయానకంగా కనిపించినా కానీ దాని లోపల ఉండే తొనలు బాగా నోరూరిస్తాయి. అతి పెద్ద సైజున్న పండ్లలో పనస పండు కూడా ఒకటి.ఇక ఇది ఏషియాలోనే ప్రసిద్ధి చెందిన ట్రాపికల్ ఫ్రూట్. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు ఇంకా ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది.ఇంకా అలాగే ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస పండు తినాల్సిందే.అయితే, పనసపండులో మాత్రమే కాదు..పనసవిత్తనాలతో కూడా పసిడిలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..ఈ పనస పండు తో పాటు దాని విత్తనాల్లో విటమిన్ సీ అనేది పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం ఇంకా జింక్ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి. అలాగే అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పనస పండు గింజలతో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పనస గింజల్లో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి ఐరన్ లభించి రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.ఇంకా శరీర జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనస గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.అలాగే పనసపండు గింజలను ఉడికించి తింటే ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.ఇంకా కంటి సమస్యల పరిష్కారం కోసం మొలకెత్తిన పనస గింజలు తినాలి.అలాగే పని ఒత్తిడి వల్ల చాలా మందిలో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి వారికి పనస గింజలు చాలా మేలు చేస్తాయి.ఈ పనస గింజలు నిత్యం తీసుకునే వారిలో ఎముకలతోపాటు దంతాలు గట్టిగా తయారవుతాయి.ఇంకా అలాగే పనస పండు గింజలను తరచూ తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ ని కూడా చాలా పెంచుకోవచ్చు.